6, జూన్ 2018, బుధవారం

వారసులు (నాటిక) 2017-18

వారసులు

(సాంఘిక నాటిక)

రచన : విద్యాధర్ మునిపల్లె బి.ఏ.,
దర్శకత్వం : వేముల మోహనరావు

ఈ నాటికను విద్యాధర్ మునిపల్లె ఈనాడు ఆదివారం పుస్తకంలో పడిన రామచంద్రారెడ్డి అనే అంధ ఉపాధ్యాయుడి జీవితంపై వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని రచించటం జరిగింది. ఈ నాటికను విద్యాధర్ మునిపల్లె 2017లో సత్యసాయికళాపీఠం (విజయవాడ) వారు నిర్వహించిన నాటిక రచనల పోటీలకు ‘‘మానవత’’ అనేపేరుతో పంపగా వారి ఎంపికల్లో ఈ నాటిక నిలవలేదు. అయినా దీనిని ప్రదర్శించాలనే తలంపుతో పరుచూరి రఘుబాబు స్మారక కళాపరిషత్ వారు నిర్వహించిన నాటికల పోటీల ప్రాధమిక పరిశీలనకు ఎంట్రీ కట్టారు. అయినా కూడా ఈ నాటిక సెలక్ట్ కాలేదు. తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బృందావన్ గార్డెన్స్, వెంకటేశ్వరస్వామి దేవాలయం(గుంటూరులో) ఈ నాటిక ప్రదర్శించటం జరిగింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తర్వాత ఈ నాటికను తెనాలిలో జరిగిన నంది నాటకోత్సవాలలో ప్రదర్శించగా అక్కడ కూడా ప్రేక్షకులు మైమరచిపోయారు. ఈ నాటిక లింక్ ని కింద వున్న డిస్ర్కిప్షన్ లో ఇస్తున్నాను. ప్రదర్శించాలనుకున్న వారు సంప్రదించండి.. సెల్: 8522990888 విద్యాధర్ మునిపల్లె.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి